ముమ్మరంగా బి ఆర్ ఎస్ ఇంటింటి ప్రచారం

ముమ్మరంగా బి ఆర్ ఎస్ ఇంటింటి ప్రచారం

భూదాన్ పోచంపల్లి, ముద్ర; భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12 వ వార్డులో శనివారం బద్రావతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ భాత్క లింగస్వామి మాట్లాడుతూ బిఆర్ఎస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధి పనులు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరోసారి సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. .ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దేవరాయ కుమార్, పట్టణ అధ్యక్షుడు సీత వెంకటేష్, బిఆర్ఎస్ పట్టణ నాయకులు తడక రమేష్, సోషల్ మీడియా కన్వీనర్ వనం యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.