యాదాద్రి జిల్లాలో కొత్త మండలం

యాదాద్రి జిల్లాలో కొత్త మండలం

భువనగిరి:-యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పడింది. వలిగొండ మండలం నుంచి పది గ్రామాలను విడదీసి కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు. చౌటుప్పల్ రెవిన్యూ డివిజన్ పరిధిలో మచ్చాద్రి వేములకొండ ఆరూర్ మండలాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నిన్న ఒక ప్రకటన జారీ చేశారు. వలిగొండ మండలం నుంచి పది గ్రామాలను విడదీసి కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు. ఈ మండలం పరిధిలో వేములకొండ, ఆరూరు, గంగాపూర్, వెంకటాపూర్, ముద్దాపూర్, చిత్తాపూర్, గోపరాజు పల్లె, గుర్నాథ్ పల్లె, దుప్పల్లి, నర్సాపూర్ గ్రామాలు ఉంటాయి.