భువనగిరిలో జోరుగా కుంభం ఎన్నికల ప్రచారం

భువనగిరిలో జోరుగా కుంభం ఎన్నికల ప్రచారం

 వాడ వాడన కుంభంకు ఘన స్వాగతాలు

ముద్ర ప్రతినిధి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని 2వ వార్డు శృతినగర్ , 5వ వార్డు రైల్వే స్టేషన్ , 6వ , 7వ వార్డు హనుమాన్ వాడలల్లో మంగళవారం భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వార్డు ప్రజలు ఆయనకు ఘన స్వాగతాలు పలికారు. ఈ సందర్భంగా కుంభం అనిల్ మాట్లాడుతూ కెసిఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని , బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని , ఆరు గ్యారంటీల పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయని అన్నారు. చేయి గుర్తుకు ఓటు వేసి భువనగిరితో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలను కైవసం చేసుకోబోతుందన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని కుంభం అనిల్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, టిపిసిసి డెలిగేట్ తంగేళ్లపల్లి రవి కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, నియోజకవర్గ మాజీ ఇంచార్జీ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ ప్రజాప్రతినిధులు , కాంగ్రెస్ , సిపిఐ నాయకులు యేశాల అశోక్ , కార్యకర్తలు , యూత్ కాంగ్రెస్ నాయకులు , ఎన్ ఎస్ యు ఐ, మహిళా విభాగం , వివిధ అనుబంధ సంఘాల నాయకులు , వివిధ వార్డుల ప్రజలు పాల్గొన్నారు.