ఎమ్మెల్యే పైళ్లను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వలిగొండ గౌడ సంఘం బిఆర్ఎస్ నాయకులు

ఎమ్మెల్యే పైళ్లను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వలిగొండ గౌడ సంఘం బిఆర్ఎస్ నాయకులు

భువనగిరి ఆగస్టు 29 (ముద్ర న్యూస్):- భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి కి మూడవ సారి  భువనగిరి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా పైళ్ళ శేఖర్ రెడ్డిని సీఎం ప్రకటించినందుకు గాను మంగళవారం వలిగొండ గౌడ సంఘం తరపున సీఎంకి  ధన్యవాదములు తెలియజేసి, ఎమ్మెల్యే ని కలిసి శాలువాతో సన్మానం చేసి వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో వలిగొండ పట్టణ 1వ ఎంపిటిసి పల్సం రమేష్ గౌడ్, గౌడ సంఘ అధ్యక్షులు కొండూరు అంజయ్య, ఉపాధ్యక్షులు బత్తిని దేవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పబ్బు స్వామి గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసుల మధుసూదన్ గౌడ్ గ్రంధాలయ చైర్మన్ పబ్బు వెంకటరమణ మరియు నాయకులు మునుకుంట్ల ధనుంజయ, పబ్బు శ్రీరాములు, కుంభం మల్లేష్, బత్తిని అయోధ్య, కొండూరు బాలరాజు, పబ్బు శెట్టయ్య, కొండూరు భాస్కర్, మునుకుంట్ల బిక్షపతి, మారగోని నర్సింహా,మారగోని బిక్షపతి కాసుల వెంకన్న పల్సం భాను రాగిరు నరసింహ గౌడ సంఘం సొసైటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.