నాన్నను ఆశీర్వదించండి..
![నాన్నను ఆశీర్వదించండి..](https://mudranews.in/uploads/images/2023/11/image_750x_6548cfc54b0cb.jpg)
- మరింత అభివృద్ధి చేసుకోండి..
ముద్ర ప్రతినిధి భువనగిరి :భువనగిరి శాసనసభ్యునిగా పైళ్ల శేఖర్ రెడ్డిని మూడోసారి ఆశీర్వదించాలని ఆయన కుమార్తె మన్విత రెడ్డి ఓటర్లను కోరారు. మండలంలోని నందనం గ్రామంలో సోమవారం గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మన్విత రెడ్డి ఓటర్లతో నాన్నను ఆశీర్వదించండి..మరింత అభివృద్ధి చేసుకోండని అన్నారు. పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కడమంచి ప్రభాకర్, మట్ట ధనుంజయ్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర రెడ్డి, మహేందర్ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నలమాస రమేష్, బి.అర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చందుపట్ల రాజేశ్వర్, మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, మాజీ సింగిల్విండో చైర్మన్ బల్గూరు మధుసూదన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆబ్బగాని వెంకట్ గౌడ్, జెక్క రాఘవేందర్, రకెల శ్రీనివాస్, కేశవపట్నం రమేష్, మట్ట బాలకృష్ణ, మూలే నాగేంద్ర బాబు, సిల్వేరు మధు, నాయకులు పాల్గొన్నారు.