కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

ముద్ర ప్రతినిధి భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చిత్రపటానికి ఆదివారం పాలాభిషేకం చేశారు. మండలంలోని సూరపల్లి , పచ్చర్లపూడి తండా, ఆకుతోట బాయ్ తండా గ్రామాల ప్రజలు వారి గ్రామాలకు చిరకాల సమస్య అయిన వంతెన నిర్మాణానికి 2 కోట్ల 25 లక్షల  రూపాయలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీల ఓం ప్రకాష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కేశవపట్నం రమేష్ పాల్గొన్నారు.