మత్స్య కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

మత్స్య కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి : మత్స్య కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా  మత్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ గా ఎన్నికైన పాశం సంజయ్ బాబు ముదిరాజ్ భువనగిరి శాసనసభ సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.  ఫైళ్ల శేఖర్ రెడ్డి నూతనగా ఎన్నికైన జిల్లా చైర్మన్ ని సన్మానించారు. అలాగే మత్స్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ తోడ్పడుతానని  తెలిపారు.

ఈ కార్యక్రమంలో  మత్య పారిశ్రామిక సహకార సంఘ జిల్లా చైర్మన్ పాశం సంజయ్ బాబు ముదిరాజ్, జిల్లా డైరెక్టర్  కుశంగుల గణేష్ ముదిరాజ్, మటూరి కుమార్ ముదిరాజ్, శంకర్ ముదిరాజ్, బోయిన ఝాన్సీ ముదిరాజ్, సోమనబోయిన సతీష్ ముదిరాజ్, భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు ముదిరాజ్, మాజీ ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, మాజీ జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్ గౌడ్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి పెంట నర్సింహా ముదిరాజ్, జిల్లా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు కొలుపుల హరినాధ్ ముదిరాజ్,  యాదగిరిగుట్ట మండలం ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు ఎల్లా వెంకటేష్ ముదిరాజ్, సాధు విజయ్ ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ జిల్లా యువజన  నాయకులు పాశం రవితేజ ముదిరాజ్ పాల్గొన్నారు.