ప్రబలుతున్న విష జ్వరాలు 

ప్రబలుతున్న విష జ్వరాలు 
  • పట్టించుకోని అధికారులు

సారంగాపూర్ ముద్ర:మండలంలోని లక్ష్మీదేవి పల్లి గ్రామం విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. బస్టాండ్ ప్రాంతంలోని సాంబార్ గంగాధర్ అనే వ్యక్తి ఇంట్లో అందరూ గత రెండు మూడు రోజులుగా జ్వరాల తో బాధపడుతున్నారు. అలాగే ధర్మానాయక్ తండ కు చెందిన వాగ్య నాయక్ కుటుంబం గత వారం రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నారు. అదే ఇంట్లో ఆయన మనవడు ప్లేట్లెట్స్ తగ్గి జగిత్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నాలుగు రోజులు చికిత్స తీసుకుంటున్నాడు. వీరే కాక గ్రామంలోని చాలామంది జ్వరాలతో బాధపడుతూ జగిత్యాల పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరికొందరు జగిత్యాలలో ఆరోగ్యం బాగా కాకపోతే కరీంనగర్ పట్టణానికి సైతం వెళ్లి చికిత్స పొందు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్న వైద్య సిబ్బంది గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా సిబ్బంది ఉండి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు