ఏబీవీపీ నాయకుల నిరసన

ఏబీవీపీ నాయకుల నిరసన

ముద్ర, తంగళ్లపల్లి: మండలకేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల యజమాన్యం విద్యార్థులను ఫీజుల పేరుతో ఒత్తిడిలకు గురిచేస్తున్నారని ఏబీవీపీ నాయకులు పాఠశాల సందర్శించారు.వివరాల్లోకి వెళితే ఒకే పాఠశాలలో శుభోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్,శ్రీ సరస్వతి  హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం, చైతన్య వంటి పేర్లతో ఒకే పాఠశాలను కొనసాగిస్తు,కిక్కిరిసిన గదులలో విద్యాబోధన కొనసాగిస్తున్నారని వెంటనే డిఈఓ పాఠశాలలను సందర్శించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫిట్నెస్ లేని వాహనాలను కొనసాగిస్తూన్నారని,విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతూ అధిక పీజులు లాగుతు విద్యను ఒక వ్యాపారంలా కొనసాగిస్తున్నారు.కాబట్టి వీటి పైన చర్యలు తీసుకోవాలని లేనియెడల డి ఈ ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. ఏబీవీపీ నాయకులు మారవేణిరంజిత్ కుమార్,నాగరాజు,లోపల్లి రాజు,తిరుపతి,రాహుల్,టేకు మధు,శ్రీనివాస్,వంశీ తదితరులు పాల్గొన్నారు.