ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు

ముగ్గురు విద్యార్థులకు గాయాలు
ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అతి వేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని  ఢీకొట్టిన సంఘటన చుంచుపల్లి మండల పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ నుండి కొత్తగూడెం వైపు వస్తున్న కారు అతివేగంతో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న విద్యార్థులు అక్షిత్, ప్రభాస్, లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి.  కారులో ఉన్న మహిళకు కూడా గాయాలయ్యాయి.వీరిలో అక్షిత్ అనే విద్యార్థిన పుట్టినరోజు కావడం గమనార్హం. పుట్టినరోజు నాడే రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. గాయపడిన ముగ్గురు విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించి కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.