జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతాం

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతాం
Government Whip Rega

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతా రావు హామీ ఇచ్చారు. ఆదివారం కరకగూడెం మండలంలోని బుర్దారంలో రేగాను బూర్గంపాడు అక్రిడేషన్ జర్నలి స్టులు కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ 2022న సీఎంవో నుంచి కొత్తగూడెంలోని 143 సర్వేలో జిల్లాలోని జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల ప్రక్రియలో భాగంగా ఇంటి స్థలాలను ఇవ్వాలని కోరారు.

దీనికి స్పందించిన ఆయన తప్పకుండా జర్నలిస్టులందరికీ ఇంటి స్థలం ఇచ్చి తీరుతా మని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి కల నెరవేరుతుందని ఆయన హామీ ఇచ్చారు.