పనులు వేగవంతం చేయండి మంత్రి అల్లోల

పనులు వేగవంతం చేయండి మంత్రి అల్లోల
Speed ​​things up Minister Allola

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లా కేంద్రంలో నిర్మించబడుతున్న కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. నిర్మల్ లో కొనసాగుతున్న కార్యాలయ భవన సముదాయ నిర్మాణ పనులను ఆయన ఆదివారం సాయంత్రం పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత లోపం లేకుండా చూస్తూ పనులు త్వరితగతి పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ఎలాంటి అలసత్వం లేకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు.