ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి - ఆసుపత్రిలో చికిత్స 

ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి - ఆసుపత్రిలో చికిత్స 

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా పెంబి మండలం నాగాపూర్ లో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేయటంతో నలుగురు ఆసుపత్రి పాలయ్యారు. నాగాపూర్ రాగి చెరువులో గురువారం 60 మంది ఉపాధి హామీ కూలీలు పనులు చేస్తున్న సమయంలో హఠాత్తుగా తేనెటీగలు వారిపై దాడి చేశాయి. దీంతో కొంత మంది ఆత్మ రక్షణ కోసం చెరువులో దూకారు.మిగిలిన వారిలో నలుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.