మైనర్ పై లైంగిక దాడి కేసులో నలుగురికి రిమాండ్

మైనర్ పై లైంగిక దాడి కేసులో నలుగురికి రిమాండ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇటీవల నిర్మల్ జిల్లా పెంబి మండలం తులసి పేట్ లో మైనర్ గిరిజన బాలికపై అఘాయిత్యం కేసు లో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. గత ఎనిమిది మాసాలుగా లైంగిక దాడి జరిపి గర్భవతి కావడంతో అబార్షన్ చేయించిన ఈ ఉదంతంలో రాజు, లాలు, తరుణ్ , సంజు లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపామని వారు పేర్కొన్నారు.