ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలి మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు

ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలి మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలను జయప్రదం చేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు లు అన్నారు. సోమవారం బిఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే ఆత్మీయసమ్మేళనాల బాధ్యతలను ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మంగా తీసుకోవాలన్నారు. ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్‌గా తీసుకొని పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలని సూచించారు. పార్టీ పటిష్టత కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండి రాజకీయంగా వారికి భరోసానివ్వడానికే బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గారి ఆదేశాల మేరకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నామని తెలిపారు. , రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేయడంతోపాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధి పథకాలను ఇంటింటికీ ప్రచారం చేసేలా దిశానిర్దేశం చేయాలన్నారు.

క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కోసం కార్యకర్తల అభిప్రాయాలు, మనోభావాలను పంచుకునేందుకే ఈ ఆత్మీయ సమ్మేళనాలను ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగ కాంతారావు , ఎమ్మేల్యేలు వనమా వెంకటేశ్వర్లు, హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వరరావు , ఎమ్మెల్సీ తాతా మధు , జెడ్పి వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు , మాజి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ , గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు