మల్టీపర్పస్ వర్కర్ కు విద్యుత్ షాక్ తీవ్ర గాయాలు 

మల్టీపర్పస్ వర్కర్ కు విద్యుత్ షాక్ తీవ్ర గాయాలు 

ముత్యాలపాడు క్రాస్ రోడ్డు రైతు వేదిక వద్ద ఘటన 

టేకులపల్లి, ముద్ర: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని  ముత్యాలంపాడు క్రాస్ రోడ్ పంచాయతీ సమీపంలోని రైతు వేదికలో చుక్కాలబోడు మల్టీపర్పస్ వర్కర్ విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుత్ షాక్ కు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... గురువారం స్వచ్ఛ భారత్ మిషన్ గురించి మండల అధికారులు, మల్టీపర్పస్ వర్కర్లకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ముత్యాలపాడు రైతు వేదికలో కరెంటు సరఫరా లేకపోవడంతో చుక్కాలబోడు పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్ భూక్య వెంకటేష్ విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభం పై విద్యుత్ సరఫరా కావడంతో వెంకటేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే సులానగర్ పీహెచ్సీకి చికిత్సకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.