పూర్వ విద్యార్థుల కలయిక...

పూర్వ విద్యార్థుల కలయిక...

మఠంపల్లి ,ముద్ర : మఠంపల్లి మండలంలోని రఘునాధపాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1992-93 లో పదవతరగతి చదివిన పూర్వ విద్యార్థులు కలయిక బుధవారం జరిగింది. ఈసందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తమకు విద్యను అందించిన గురువులను సన్మానించారు. ఈకార్యక్రమంలో గురువులు బీరీల్లి శ్రీనివాస్ రెడ్డి, పులిపాటి నర్సయ్య,ఆచల, యాదగిరి కోటయ్య,పందిరి ప్రతాప్ రెడ్డి, శాస్త్రి,శ్రీమన్నారాయణ, పూర్వ విద్యార్థులు మన్సూర్ అలీ,ఇరుగు బాబు, డాక్టర్ ఈమావాలి, సత్యం, తదితరులు పాల్గొన్నారు.