బిఆర్ఎస్ కు తిరుగులేదు

బిఆర్ఎస్ కు తిరుగులేదు
  • తెలంగాణ ప్రజలంటే కేంద్ర ప్రభుత్వానికి చిన్న చూపు
  • ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి ఎదురులేదని, రాష్ట్రంలో మళ్లీ రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. చండ్రుగొండ మండల పరిధిలోని అయ్యన్నపాలెంలో ఆదివారం జరిగిన బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర మన్న, తెలంగాణ ప్రజలు అన్న విలువ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. మూడోసారి ముచ్చటగా రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారం రావడం ఖాయం అని అన్నారు. సమావేశంలో అశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు , డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం,జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు రావు జోగేశ్వరరావు,దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,దొడ్డకుల రాజేశ్వరరావు, బోయినపల్లి సుధాకర్ రావు, జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి,మోహన్ రెడ్డి,మోహన్,రఘు,తదితరులు పాల్గొన్నారు.