భద్రాద్రి జిల్లాకు జాతీయ స్థాయి పురస్కారం - జిల్లా కలెక్టర్ అనుదీప్

భద్రాద్రి జిల్లాకు జాతీయ స్థాయి పురస్కారం - జిల్లా కలెక్టర్ అనుదీప్

 ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి జిల్లాకు జాతీయస్థాయి పురస్కారం లభించిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

చుంచుపల్లి మండల పరిధిలోని గౌతం పూర్ పంచాయతికి జాతీయస్థాయిలో హెల్ది పంచాయతి అవార్డు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 9 అంశాలలో అవార్డులు ఎంపిక ప్రక్రియ జరిగిందని, వాటిలో హెల్ది పంచాయతి విభాగంలో గౌతంపూర్ పంచాయతీకి జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించినట్లు తెలిపారు. పంచాయతీలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలు, పచ్చదనం పెంపొందించుటకు చేపట్టిన చర్యలు, మురుగునీరు నిర్వహణ తదితర అంశాలపై చేసిన కృషికి జాతీయ స్థాయిలో లభించిన గౌరవమని ఆయన పేర్కొన్నారు. వ్యర్థాలు, వ్యాధులు నుండి స్వచ్ఛత కొరకు చేసిన నిరంతర కృషి ఫలితంగా నేడు మన జిల్లాకు జాతీయ స్థాయిలో హెల్ది పంచాయతి విభాగంలో మొదటి స్థానం వచ్చినట్లు చెప్పారు. ఇదే కృషితో జిల్లాను అభివృద్ధి లో రోల్ మోడల్ గా తయారు చేయాలని అన్నారు. ఈ అవార్డు సాధించడం మనందరి పనితనానికి లభించిన గౌరవమని ఆయన పేర్కొన్నారు. అవార్డు సాధనకు కృషి చేసిన సర్పంచ్ పోడియం సుజాతను, కార్యదర్శి జక్కంపూడి షర్మిళను, డిపిఓ రమాకాంత్ ను, డిఆర్డీఓ మధుసూదన్ రాజును, జడ్పి సీఈఓ విద్యాలతను, ఎంపీడీఓ రమేషను, ఎంపిఓ సత్యనారాయణను

ప్రత్యేకంగా అభినందించారు.