మాజీ ఎమ్మెల్యే మృతదేహానికి పలువురి నివాళులు 

మాజీ ఎమ్మెల్యే మృతదేహానికి పలువురి నివాళులు 

 ముద్ర ప్రతినిధి, జగిత్యాల : మెట్ పల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాములు రెండు రోజుల క్రితం అనారోగ్యంతో హైదారాబాదులో మృతి చెందగా మెట్ పల్లిలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పార్థివ దేహానికి రాజ్యసభ సభ్యుడు, బిఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, కోరుట్ల ఏమ్మేల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి, అంతిమయాత్రలో పాల్గొన్నారు, అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.