52 లక్షలతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

52 లక్షలతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

 ముద్ర, రాయికల్ : రాయికల్ పట్టణంలో రూ. 3.5 కోట్లతో టియుఎఫ్ ఐడిసి నిధులలో 5, 6,7,12 వార్డులలో 52 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణా పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం రాయికల్ మండల ధావన్ పల్లి గ్రామానికి చెందిన భూక్య సమీక్ష రాయికల్ లోని కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతిలో మంచి మార్కులు సాధించి కరీంనగర్ ట్రినిటీ కళాశాలలో ఇంటర్మీడియట్ బై పి సి లో ప్రభుత్వము ద్వారా ఉచిత సీటు సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే జగిత్యాల సమీక్షను అభినందించిచారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమండ్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, కమిషనర్ సంతోష్, స్థానిక కౌన్సిలర్ లు అన్వరి భేగం, ఎలిగెటి లతిక అనిల్, మహేష్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షులు ఇంతియాజ్, ప్యాక్స్ ఛైర్మెన్ ఏనుగు మల్లారెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు కొల శ్రీనివాస్,వైస్ ఎంపీపీ మహేశ్వరి, ఎఇ ప్రసాద్, మాజీ ఎఎంసి  ఛైర్మెన్ రాజీ రెడ్డి, కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో సర్పంచ్ యమునా రవీందర్, తదితరులు ఉన్నారు.