మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ రైతుల రాస్తారోకో..
![మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ రైతుల రాస్తారోకో..](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6405a52c3908c.jpg)
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల మున్సిపల్ నూతన మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల గొల్లపల్లి రహదారిపై తిమ్మాపూర్ రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ వ్యవసాయ భూములను ఇండస్ట్రియల్, రిక్రియేషన్ జోన్లుగా చూపిస్తూ జగిత్యాల నూతన రూపొందించారని దీంతో తాము పూర్తిగా ఉపాధి కోల్పోవాల్సి వస్తుందన్నారు. అందరం దాదాపుగా చిన్న రైతుల మేనని భూములు కోల్పోతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ పూర్తిగా రద్దు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేంతవరకు తమ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. రైతుల రాస్తారోకతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోగా విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింప చేశారు.