మేరా బూత్ సబ్ సే మజ్బూత్ లో బిజెపి నేతలు

మేరా బూత్ సబ్ సే మజ్బూత్ లో బిజెపి నేతలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: మేరా బూత్ - సబ్ సే మజ్ బూత్  కార్యక్రమం లో భాగంగా  ప్రధాని నరేంద్ర మోడీ  మధ్యప్రదేశ్  భోపాల్ నుండి దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్ బూతుల కార్యకర్తలతో మంగళ వారం సంభాషించారు. ఈ కార్యక్రమాన్ని నిర్మల్ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన గారి భూమయ్య, పెద్దపెల్లి జిల్లా ఇంచార్జి రావుల రామనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి గాద విలాస్ పట్టణ అధ్యక్షులు సాదం అరవింద్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గుడిసెల అర్జున్ బిసి జిల్లా ఉపాధ్యక్షుడు తోట సత్యనారాయణ పట్టణ ప్రధాన కార్యదర్శి లు అల్లం భాస్కర్ రామోజు నరేష్ తదితరులు పాల్గొన్నారు.