ఈ దేశంలో ఇద్దరికీ మాత్రమే ఆధార్ కార్డులు ఇవ్వాలి

ఈ దేశంలో ఇద్దరికీ మాత్రమే ఆధార్ కార్డులు ఇవ్వాలి

హనుమాన్ విజయ శోభాయాత్రలో శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద స్వామి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : శ్రీ వీర హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలో విశ్వహిందు పరిషత్ - బజరంగ్దల్ అధ్వర్యంలో  వీర హనుమాన్ విజయ శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పాల్గొన్న  శ్రీపీఠం వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద స్వామి మాట్లడుతూ  ఈ దేశంలో ఆధార్ కార్డులు ఇద్దరికి మాత్రమే ఇవ్వాలని, హిందూ జీవనం కొనసాగిస్తున్న వారు ఒకరు మరొకరు హిందువులను గౌరవించేవారుఅని వీరికి మాత్రమే ఆధార్ కార్డులు ఇవ్వాలని అన్నారు. తాను ఏ ఒక్క వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడడం లేదని అన్నారు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశము రెండు పవిత్రమైన వేనని శ్రీరామచంద్రుడు ఉత్తర భారత దేశంలో జన్మిస్తే, హనుమంతుడు దక్షిణ భారతదేశంలో జన్మించారని అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర భారత దేశంలో జన్మించినప్పటికీ దక్షిణ భారతదేశంలోని గురువాయూర్ లో నివసించారని గుర్తు చేశారు. జగిత్యాలలో మాట్లాడుతున్న నా మాటలు జగమంతా చేరుకుంటుయని అన్నారు. తాను అన్ పార్లమెంటరీ పదాలు మాట్లాడడం లేదని తెలిపారు . అంతకు ముందు మడలేశ్వర టెంపుల్ వద్ద శోబ యాత్రలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమారు పాల్గొన్నారు.  శోభ యాత్రలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన హనుమాన్ దీక్ష స్వాములు, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, వివిధ హిందూ సంస్థల నాయకులు పాల్గొన్నారు.