పోగొట్టుకున్న సొమ్ము భక్తులకు అందజేత...

పోగొట్టుకున్న సొమ్ము భక్తులకు అందజేత...
Kondagattu Anjanna devotees

ముద్ర, మల్యాల: కొండగట్టు అంజన్న సన్నిధిలో భక్తులు పోగొట్టుకున్న సొమ్మును స్థానిక పోలీసులు వెతికిపట్టుకొని అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి... కొత్తగూడెం జిల్లా, భద్రాద్రికి చెందిన భాసంశెట్టి వెంకటలక్ష్మి, ఆమె భర్త రాంమోహన్ రావు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దర్శనంకు వచ్చారు.

ఈ క్రమంలో వెంకటలక్ష్మి బ్యాగ్ పోగొట్టుకుంది. ఎంతకీ దొరకపోవడంతో స్థానిక అవుట్ పోస్ట్ సిబ్బందికి పిర్యాదు చేయగా, వెంటనే పోలీస్ సిబ్బంది బ్యాగ్ వెతికి పెట్టుకొని వారికి అందజేశారు. బ్యాగ్ లో రెండు తులాల బంగారు ఆభరణం, దాదాపు 7 వేలు నగదు, చిన్న మొబైల్ ఉన్నట్లు ఏఎస్ఐ శ్రీనివాస్, హోం గార్డ్ సంపత్ తెలిపారు. బ్యాగ్ వెతికి అందజేసిన పోలీస్ సిబ్బందిని వారు అభినందిచారు.