కన్నతల్లి లాంటి కాంగ్రెస్ ను ఆదరించాలి: టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ

కన్నతల్లి లాంటి కాంగ్రెస్ ను ఆదరించాలి: టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ
TPCC General Secretary Edavalli Krishna

 ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అన్ని వర్గాల ప్రజలు ఆదరించి రానున్న ఎన్నికల్లో గెలిపించాలని పిపిసిసి జనరల్ సెక్రెటరీ ఎర్ర కృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని హెడ్ఆఫీస్  వద్ద హత్ సే హత్ అభియాన్ జోడో యాత్ర  కార్యక్రమం కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఎడవల్లి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.  ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్  అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధాలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

కన్నతల్లి లాంటి కాంగ్రెస్ కు మాత్రమే ఇక్కడ ప్రజల కష్టాలు తెలున్నారు. వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీని గెలిపిస్తేనే తెలంగాణ కష్టాలు తీరుతాయన్నారు. బిజెపి పెట్టుబడిదారుల పార్టీ,  అని బి అర్ యస్ దొరల పార్టీ అని దుయ్యబట్టారు.కాంగ్రెస్ పార్టీ పేదలు,దళిత, గిరిజన, మైనార్టీల పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.500లకే సిలిండర్ ఇచ్చి పేదలను ఆదుకుంటుందని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు సాయం అందిస్తుందని, అపన్న హస్తం పేదలకు అభయ హస్తం ఇస్తుందన్నారు.

ఈ కార్యక్రమములో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య,కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్,లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు సకినాల వెంకటేశ్వరరావు, చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్, పట్టణ బీసీ సెల్ అద్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు, పట్టణ మహిళ అధ్యక్షురాలు వాలి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుబ్బా రెడ్డి, intuc నాయకులు బొజ్జ వెంకట స్వామి, వెలెటి వెంకటేశ్వర్లు, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.