వికలాంగుల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

వికలాంగుల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

కోరుట్ల ముద్ర న్యూస్:-వికలాంగుల జీవన తోడ్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రకటించిన వికలాంగులకు పెన్షన్ 3016 నుండి 4016 వరకు పెంచినందుకు గాను కోరుట్ల మండల అధ్యక్షుడు మారంపెల్లి భూమయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కోరుట్ల మండల వికలాంగుల,బి.ఆర్.ఎస్ అధ్యక్షులు మాట్లాడుతూ సమాజంలో వికలాంగులకు ఉన్నత స్థానం కల్పించి జీవన భృతి కల్పించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితాంతం రుణపడి ఉంటామని వారి నాయకత్వం మరింత బలపరుస్తామని అలాగే ఆయన చేస్తున్న రాష్ట్ర అభివృద్ధిలో అందరూ చేయి చేయి కలిపి ఔర్ ఏక్ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో మరోసారి కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బి.ఆర్.ఎస్ అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ దారిశెట్టి రాజేష్, ఎంపీటీసీ కృష్ణారెడ్డి,ఉపసర్పంచ్ మల్లారెడ్డి, పాక్స్ చైర్మన్ ఆదిరెడ్డి, పెన్షన్ దారులు, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.