మైసమ్మ తల్లి కేసీఆర్ కు మంచి మనసు ప్రసాదించు. 

మైసమ్మ తల్లి కేసీఆర్ కు మంచి మనసు ప్రసాదించు. 
  • మోకాళ్ళపై మొక్కులు చెల్లించిన కాంగ్రెస్ నాయకులు..

మెట్‌పల్లి ముద్ర:-ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు కరిగించి రైతుల అకౌంట్ లో ధాన్యం పైసలు వేసేలా మంచి మనసు ప్రసాదించాలని  మైసమ్మ ను వెడుకున్నట్లు బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని వేంపేట గ్రామంలో కాంగ్రెస్ చెరువు కట్ట వద్ద మైసమ్మ కు మోకాళ్ళ పై మొక్కులు చెల్లించుకున్నారు. వరి ధాన్యం అమ్మి దాదాపుగా నెల రోజులు గడుస్తున్నా రైతుల అకౌంట్ లో ఇంక పైసలు పడలేదన్నారు. ఒక వైపు పంట కోసం తెచ్చిన అప్పులు కట్టలేక ఖరీఫ్ పంట కోసం విత్తనాలు కొనలేక పురుగుల మందు తాగి చచ్చేందుకు ప్రయత్నిస్తుంటే.రైతులు రోడ్ల పై నిరసన తెలుపుతుంటే. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. దశాబ్ది వేడుకల పేరిట ప్రజాధనం వృదా చేస్తున్న ప్రభుత్వానికి రైతులకు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. తెలియక కాలంలో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందన్నారు. రైతులను ఏడిపించిన ప్రభుత్వాలు బాగుపడినట్టు చరిత్రలో లేదని రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించడం ఖాయం అన్నారు. మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు వెలమల రాజారెడ్డి, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి, వెంటపర్తి శ్రీనివాస్,మహేష్,ఏలేటి తిరుపతి,నరేందర్ రెడ్డి, నల్ల శేఖర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, ఏలేటి అజయ్, శశిధర్, సునీల్, అరుణ్ ,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు