మున్నూరు కాపు విద్యార్థులకు లైబ్రరీ, వసతిగృహం కోసం జడ్పీ చైర్ పర్సన్ కు వినతి 

మున్నూరు కాపు విద్యార్థులకు లైబ్రరీ, వసతిగృహం కోసం జడ్పీ చైర్ పర్సన్ కు వినతి 

ముద్ర ప్రతినిధి జగిత్యాల :  జిల్లా మున్నూరు కాపు విద్యార్థులకు లైబ్రరీ, వసతిగృహం మరియు కమ్యూనిటీ హాల్ కు స్థలం జగిత్యాల పరిధిలో  కేటాయించలని మున్నూరు కాపు నాయకులు, విద్యావంతులు జడ్పీ క్యాంప్ కార్యాలయంలో  జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారిని కలసి వినీతీ పత్రం అందజేశారు. దీనికి జడ్పీ చైర్ పర్సన్ గారు సానుకూలంగా స్పందించి, జిల్లా మంత్రి , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శాసనసభ్యుల దృష్టి కి తీసుకువెళ్ళి స్థలం ఇచ్చే విదంగా కృషి చేస్తా అనీ అన్నారు. మున్నూరు కాపు విద్యావంతుల హరి అశోక్ కుమార్, సాసల మలికర్జున్, జంగిలి రాజ్ రెడ్డి మున్నూరు కాపు నాయకులు సమిండ్లా శ్రీనివాస్, వెంకట్, సత్యం,కొక్కు గంగాధర్, కొలగని అంజయ్య,కోల శ్రీనివాస్,తెలు రాజు రమేష్ గంగాధర్,రాజ్ రెడ్డి,కోల శ్రీనివాస్,ఆకుల లక్ష్మీ నారాయణ, నీలి మలయ్య, రాంరెడ్డి, నీలి రమేష్, నీలి తిరుపతి, కొల్లూరి వేణు నియోజకవర్గం మున్నురు కాపునాయకులు తదితరులు ఉన్నారు.