ప్రధాని నరేంద్రమోడీ మెట్రోలో ప్రయాణం

ప్రధాని నరేంద్రమోడీ మెట్రోలో ప్రయాణం
  • ఢిల్లీ యూనివర్శిటీ శతాబ్ధి ఉత్సవాలకు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తూ సాధారణ ప్రయాణికులతో కలుపుగోలుగా మాట్లాడారు. ఢిల్లీ యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలకు ఆయన మెట్రోనే ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమానికి నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీ మెట్రోలో ఆయన ప్రయాణికులతో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీ మెట్రో రైలులో యువతీ, యువకులు, మహిళలతో మోదీ ఎంతో ఉత్సాహంగా, నవ్వుతూ ముచ్చటించారు. చాలాకాలం నుంచి పరిచయం ఉన్న స్నేహితులతో మాట్లాడినట్లుగా వీరి హావాభావాలు  కనిపించాయి. ఢిల్లీ యూనివర్శిటీలో శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో  విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన గౌరవ అతిథిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మోదీ టెక్నాలజీ ఫ్యాకల్టీ, కంప్యూటర్ సెంటర్, అకడమిక్ బ్లాక్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తారు. కాఫీ టేబుల్ పుస్తకాలను ఆవిష్కరిస్తారు. ఓ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.