ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెచ్చిపోయారు!
- సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేయించారు
ముద్ర, తెలంగాణ బ్యూరో : వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన అనుచరులతో సెక్యూరిటీ సిబ్బందిపై రెచ్చిపోయారు. అనంతరం తన అనుచరులతో కలిసి దాడి చేయించారు. ఓ అపార్ట్మెంట్ వద్ద సెక్యూరిటీ గార్డుపై ఆయన అనుచరులు ప్రతాపం చూపించడం కలకలం రేపింది. హైదరాబాద్లో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన అనుచరులతో కలిసి రెచ్చిపోయారు. గచ్చిబౌలి అపర్ణ సెరెన్ అపార్ట్మెంట్లో పార్కింగ్ వివాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంటు రోడ్డుపై పార్కింగ్ చేయొద్దని సెక్యూరిటీ సూచించారు. దీంతో అనిల్ మనుషులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అపార్ట్మెంట్ సెక్యూరిటీపై తమ ప్రతాపం చూపించారు. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని తన మనుషులతో చితకబాదించారు. అపార్ట్మెంట్ సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో ఒకటి అపార్ట్మెంట్ ముందు వాహనాలేవీ పార్క్ చేయకుండా చూడడం, తద్వారా అపార్ట్మెంటు వాసులకు ఇబ్బంది కలగకుండా చూడడం అనేది వాస్తవం. అదేపని చేసినందుకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేయించారు. ఈ తతంగం మొత్తాన్ని అపార్ట్మెంట్ వాసులు వీడియో తీశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.