మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ట్వీట్​కు  ఈటల సమాధానం

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ట్వీట్​కు  ఈటల సమాధానం

ముద్ర, తెలంగాణ బ్యూరో : వయస్సు పెరిగిన కొద్ది ప్రజాజీవితంలో ఉన్నవాళ్లు జాగ్రతగా ఉండాలని మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి చేసిన ట్వీట్టర్​పై హూజురాబాద్​ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్​ ఈటల రాజేందర్​ స్పందించారు. ప్రజ్ఞాపూర్ హరిత హోటల్ దగ్గర ఆగిన సందర్భంగా మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఈటల రాజేందర్ సమాధానం చెప్పారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లు ఏది పడితే అది, ఎవరి గౌరవానికి భంగం కల్గించకుండా ఉండాలన్నారు. ఇతరుల స్వేచ్ఛను, గౌరవాన్ని తగ్గించకూడదని ఈటల రాజేందర్​ అన్నారు. జితేందర్​రెడ్డి ఎందుకు ట్వీట్ చేశారో తెలియదని, ఆయన ఉద్దేశం ఏంటో ఆయననే అడిగి తెలుసుకోవాలని ఈటల సూచించారు.