ఘనంగా బీరప్ప కళ్యాణ మహోత్సవ వేడుకలు

ఘనంగా బీరప్ప  కళ్యాణ మహోత్సవ వేడుకలు

ఉత్సావాల్లో పాల్గొన్న 15 మంది హైకోర్ట్ న్యాయమూర్తులు 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీరప్ప దేవాలయంలో బీరప్ప  కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం  జరిగిన శ్రీ బీరప్ప కామరతి దేవి కళ్యాణ మహోత్సవంలో జస్టిస్ కులకర్ణి తోపాటుగా హైకోర్టు న్యాయమూర్తులు పుల్ల కార్తీక్, అనుపమ చక్రవర్తి, కే. లక్ష్మణ్, ఎం. లక్ష్మణ్, మాధవి, శరత్, శ్రీనివాస్, వేణుగోపాల్, నంద, రాజేశ్వరరావు, శ్రవణ్ కుమార్, సంతోష్ రెడ్డి, తుకారం, శ్రీ సుధాలు పాల్గొని ప్రతేక పూజలు నిర్వహించారు.

ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

 ఈ సందర్బంగా నాగవెల్లి పట్నాలు నిర్వహించగా ఎమ్మెల్సీలు కవిత, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావా వసంత సురేష్, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. గొల్లపల్లి చంద్ర శేకర్ గౌడ్, ఒల్లం మల్లేశం, దయాల మల్లారెడ్డి కురుమ సంఘం నాయకులు ప్రజా ప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.