బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మురళీ

బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మురళీ

మెట్‌పల్లి ముద్ర:- బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ను విమర్శించే స్థాయి పూటకో పార్టీ మారే వ్యక్తులకు లేదని . బీ ఆర్ ఎస్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు అరిసే మురళీ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ. నిత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడే ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ను కొందరు బీజేపీ నాయకులు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే దయతో ఐదు సంవత్సరాలు ఉన్నత పదవి అనుభవించి పదవి కాలం ముగిసిన తరువాత స్వలాభం కోసం బీజేపీ లో చేరిన నాయకుడు ఎమ్మెల్యే కల్వకుంట్ల పై విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు.ఎమ్మెల్యే ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.పట్టణ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బిట్లుగు కార్తీక్, కారం రాజు, మ్యాకల నరేష్, విశ్వాస్, శివ ప్రసాద్ లు ఉన్నారు.