కురవిలో జవహార్ లాల్ నెహ్రూ వర్ధంతి

కురవిలో జవహార్ లాల్ నెహ్రూ వర్ధంతి

ముద్రప్రతినిధి, మహబూబాబాద్:భారతదేశ తొలిప్రధాని జవహార్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీలఆద్వర్యంలో శనివారం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కురవి మండల పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ..కార్యక్రమం కురవి టౌన్ ప్రెసిడెంట్ నారాయణ రాజేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో కురవి మండల ఎస్సీసెల్ అధ్యక్షులు కామిండ్ల  వీరన్న, బీసీ సెల్ అధ్యక్షులు చిన్నం గణేష్, సీనియర్ నాయకులు మిర్యాల లక్ష్మయ్య, కత్తి వెంకన్న, తరాల వీరభద్రం, నల్లెల గ్రామపార్టీ అధ్యక్షులు బండి మల్లయ్య, కురవి మండలం  యూత్ కాంగ్రెస్ నాయకులు కొర్ని అనిల్, పరిపూర్ణ, చందర్, దండ్రు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు