వరుస పెట్టి జింకల మృతి..జంతు ప్రేమికుల ఆగ్రహం

ముద్ర ప్రతినిధి వికారాబాద్: వికారాబాద్ అనంతగిరి అటవీ ప్రాంతంలో  వరుస జింకల మరణాలు సంభవిస్తున్నాయి. జింక మృతి చెంది రెండు రోజులు గడవక ముందే మరో జింక మృతి చెందింది. రోడ్డు ప్రమాదంలో కొన్ని, కుక్కల దాడిలో మరికొన్ని కాగా తాజాగా అనంతగిరి అనంత పద్మనాభ స్వామి దేవస్థానం గుండంలో పడి మరో జింక మృతి చెందింది. దాహార్తిని తీర్చుకునేందుకు వచ్చిందో లేక ప్రమాద వశాత్తూ పడిందో కానీ ఎవరూ గమనించక పోవడంతో ఎంత సేపు ఉందో ఏమోకానీ చివరికి ప్రాణాలు విడిచింది.

అయినప్పటికీ దేవాలయం వారు కానీ అధికారులు కానీ ఇప్పటి వరకు చూడకపోవడం విచారకరం అని ఆ వంక వెళ్లిన భక్తులు వాపోగా, జింక మృతి పట్ల జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన సాసర్ ప్లేట్లలో నీరు నింపాల్లంటున్నారు.