బిజెపి, బీఆర్ఎస్ ల నుంచి పలువురు కాంగ్రెస్లో చేరిక 

బిజెపి, బీఆర్ఎస్ ల నుంచి పలువురు కాంగ్రెస్లో చేరిక 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి ఆది వారం నియోజకవర్గంలోని బషీరాబాద్  మండలం నీళ్ళపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బీజేపీ, బీఆర్ఎస్ ల నుండి పలువురు  కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ  ర్రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావబోతుందని,అధికారంలోకి రాగానే సోనియా గాంధీ గారు ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్ లను కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. కే సిఆర్ ఈ రాష్టంని అప్పుల కుప్పల చేసిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు కూడ ఏకకాలంలో రూ. 2 లక్షల రూణపాఫీ చేస్తామని అన్నారు. దళిత బంధు, బిసి బందు, కాగితాల వారికే సరిపోయాయని, తప్ప ఓక్కరికి కూడ అందిచలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో మాటలను అన్ని ఒక్క జూట మాటలు అని అన్నారు.