మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరికలు

మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరికలు

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం వివిధ కార్యక్రమాలలో పాల్గొని బీ ఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు
 వికారాబాద్ మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన 40మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంపీటీసీ గోపాల్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి  గడ్డం ప్రసాద్ కుమార్  సమక్షంలో బీ ఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆలాగే వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 28వ వార్డు పాత గంజికి చెందిన బీఆర్ఎస్ వార్డు ప్రెసిడెంట్ చిలుకూరి సంగమేశ్వర్ చేరారు. పార్టీలో చేరిన వారికి ప్రసాద్ కుమార్  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.  వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 28వ వార్డు పాత గంజికి చెందిన బీఆర్ఎస్ వార్డు ప్రెసిడెంట్ చిలుకూరి సంగమేశ్వర్  బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.