కృష్ణా జలాలను జిల్లాకు తీసుకు రాని బీఆర్ఎస్ ను ఓడించాలి 

కృష్ణా జలాలను జిల్లాకు తీసుకు రాని బీఆర్ఎస్ ను ఓడించాలి 

తాండూర్ జనసేన అభ్యర్థి  శంకర్ గౌడ్ ను గెలిపించాలని చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరులో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ విజయం   కోసం తాండూరు పట్టణంలో విస్తృత ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ నాయకులు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొని తాండూర్ జనసేన అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ , బీజేపీ నాయకులు యు.రమేష్ తదితరులతో కలిసి ప్రచారం చేశారు. తాండూర్ పట్టణంలోని భద్రేశ్వర చౌరస్తా లో ఉన్న వ్యాపారులను, ప్రజలను కలిసి గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే పాలన చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడికి పాల్పడిందన్నారు. తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతాలకు కృష్ణా జలాలు తీసుకు రాలేదని విమర్శించారు. తాండూరును కాలుష్య రహితంగా చేస్తానని ఇచ్చిన హామిని బీ ఆర్ ఎస్ నిలబెట్టుకోలేక పోయిందని అన్నారు.  ఈ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ ను ఓడించి గుణపాటం చెబుదామని అన్నారు.

తాండూరు కలుషిత రాజకీయాల్లో మార్పు రావాలంటే జనసేనతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్, సీనియర్ నాయకులు మనోహరావు, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, తాండూరు పట్టణ అభ్యర్థి సుదర్శన్ గౌడ్, మహిళ మోర్చ నాయకురాలు అర్చన, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.