స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న తాండూరు బీఅర్ఎస్ అభ్యర్థి ,ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి 

స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న తాండూరు బీఅర్ఎస్ అభ్యర్థి ,ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి తన స్వగ్రామమైన బషీరాబాద్ మండలం ఇందర్చెడ్ గ్రామంలో ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదం మాతోనే..అభివృద్ధి కి తాండూరు ప్రజలు పట్టం కడుతున్నారని అన్నారు.కుట్రదారులను ప్రజలు తిప్పికొట్టారు. బంగారు తెలంగాణలో భావి తరాల భవిష్యత్తు ఆగం కాకుండా 3వ సారి కేసిఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు, సార్ తోపాటు నేనుకూడా అసెంబ్లీ లో అడుగు పెట్టబోతున్నా అని అన్నారు.