భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం - పైలెట్ రోహిత్ రెడ్డి హామీ

భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం - పైలెట్ రోహిత్ రెడ్డి హామీ

ముద్ర ప్రతినిధి ,వికారాబాద్: ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తాండూరు పట్టణంలోని తాపీ మేస్త్రీలతో సమావేశమైన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఎన్నికల్లో బి ఆర్ ఎస్ కు

 మద్దతిచ్చి బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. తాండూర్ పట్టణంలో నిత్యం వందలాది కార్మికులు వివిధ పనులు చేస్తున్నారని వారికి ప్రభుత్వం తరఫున భద్రత కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తాండూరు నియోజకవర్గంలో నిత్యం అనేక నిర్మాణాలు జరుగుతున్నాయని వాటిలో పనిచేసే కార్మికులకు ప్రభుత్వపరంగా భద్రత కల్పించే దిశగా కృషి చేస్తామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హామీ ఇచ్చారు.

 ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించారు. వారందరూ తాండూరు అభివృద్ధి ఒక్క రోహిత్ రెడ్డి కే సాధ్యమని తమ మద్దతును ప్రకటించారు.