నిజాయితీ గల అధికారి ఆకస్మిక బదిలీ..!! | Mudra News

నిజాయితీ గల అధికారి ఆకస్మిక బదిలీ..!! | Mudra News
District Forest Officer Venkat Reddy

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: జిల్లా అటవీ శాఖ అధికారి వెంకట్ రెడ్డి ని రాష్ట్ర అటవీశాఖ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి జిల్లాలోని అటవీ శాఖ భూములను ప్రత్యేక దృష్టి పెట్టి ఇంక్రొచ్ మెంట్ అయిన వాళ్లపై కేసులు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా నిజాయితీ గల అధికారులు వికారాబాద్ జిల్లాలో ఎక్కువ కాలం ఉంచరని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జిల్లా లో కొన్ని నెలల పాటు విధులు నిర్వహించినప్పటికీ నిజాయితీ గల అధికారిగా పేరొందారు.అయితే ఇంత ఆత్రుతగా బదిలీ చేయడంపై జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.