రోహిత్ రెడ్డి నీ భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం..

రోహిత్ రెడ్డి నీ భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం..

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: ఔర్ ఎక్ ధక్కా.. రోహిత్ అన్న పక్కా అని కాంగ్రెస్ పార్టీ నీ వీడి బీఅర్ఎస్ పార్టీలో చేరిన తాండూరు మండల నాయకులు అన్నారు. తాండూరు మండల పరిధిలోని గుంతబాస్పల్లి ఉపసర్పంచ్ కైరత్ అలి తన అనుచరులతో కలిసి సోమ వారం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో ఈరోజు బీఅర్ఎస్ పార్టీలో చేరారు. అదేవిధంగా మండల పరిధిలోని సిరిగిరిపేట్ గ్రామ కాంగ్రెస్ నాయకులుకు బీఅర్ఎస్ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. బయటోన్ని తాండూరు పొలిమేర దాటి తరుముతాం.. రోహిత్ అన్నను భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ పార్టీ లో పని చేస్తున్న వారికి విలువ లేదని ఎక్కడో పరిగి నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ పెద్దరికం చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు పార్టీలో చేరుతున్నట్టు వారు తెలిపారు.