నేదు తాండూర్ లో జనసేనా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచారం

నేదు తాండూర్ లో జనసేనా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచారం

ముద్ర ప్రతినిధి, వికారాబాద్; వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ ఉమ్మడి బిజెపి జనసేన పార్టీ అభ్యర్థి శంకర్ గౌడ్  పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా మాట్లాడుతూ గెలిచిన తర్వాత అమ్ముడుపోయే నాయకులకు ఓట్లు వేయకూడదని ఉమ్మడి బిజెపి జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్ అన్నారు . ఎన్నికల్లో గెలవడానికి రూ. కోట్ల కొలది ఖర్చు చేసిన పార్టీ అభ్యర్థులు గెలిచిన తర్వాత కమిషన్లకు అలవాటు పడతారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్  అవినీతి రహిత సమాజం కోసం కృషి చేస్తున్నారన్నారు. మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాసు గుర్తుపై వేసి నన్ను గెలిపించగలరని ఒక్క అవకాశం ఇవ్వండి అని కోరుకుంటున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి స్థానిక విలియం మూన్ హై స్కూల్ చౌరస్తా నుండి ఇందిరా చౌక్ వరకు రోడ్ షో నిర్వహించి ఇందిరాచౌక్లో భారీ బహిరంగ సభలో పాల్గొని నియోజకవర్గ ప్రజల సమస్యలపై, నిరుద్యోగ యువతీ యువకుల ఉద్యోగాలపై, తాండూరు అభివృద్ధిపై మాట్లాడతారని కావున నియోజకవర్గ ప్రజలు నిరుద్యోగులు అభిమానులు బిజెపి జనసేన కార్యకర్తలు జనసైనికులందరూ సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బీజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్, బీజెపి రాష్ట్ర నాయకురాలు పటేల్ జయశ్రీ , రవీందర్, రామన్న, షోరూమ్ రాజు ,అమ్రేష్ ,పవన్ తదితరులు పాల్గొన్నారు.