బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చగనే కాంగ్రెస్ లో చేరికలు
కాంగ్రెస్ పార్టీలో చేరిన ముత్తారం యువకులతో దుద్ధిళ్ల శ్రీనుబాబు
ముద్ర, ముత్తారం: బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చకనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు అన్నారు.
ముత్తారం మండల కేంద్రంలోని ముత్తారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యూత్ సబ్యులు వంద మంది యువకులకు శ్రీనుబాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. యువకులకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా శ్రీనుబాబు ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ, జ్వరం సర్పంచ్ తూటి రజిత రఫీ, మాజీ జడ్పిటిసి నాగినేని జగన్ మోహన్ రావు, నాయకులు బియ్యాని శివకుమార్, మద్దెల రాజయ్య, బుచ్చంరావు, గాదం శ్రీనివాస్, అనుము గోపి, వెలిమారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ముత్తారం మండల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.