భర్త గెలుపు కోసం భార్య ప్రచారం

భర్త గెలుపు కోసం భార్య ప్రచారం

తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  సతీమణి  ఆర్థిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీ ఆర్ ఎస్ లో చేరిక 

ముద్ర ప్రతినిధి,వికారాబాద్: తన భర్త తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  సతీమణి  ఆర్థిరెడ్డి తాండూరు పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సంద్భంగా అర్తిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఅర్ఎస్ పార్టీలో చేరారు.  పట్టణంలోని ఆమె చేస్తున్న ప్రచారంలో  బీఅర్ఎస్ పార్టీ పథకాలతో పాటు పార్టీ మానిఫెస్టో లోని హామీల ప్రాముఖ్యత గురించి వివరించారు. రాష్ట్రంలో బీఅర్ఎస్ పార్టీ మరోసారి అధికారం చేపట్టడంతో పాటు తాండూరు లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  మరోసారి ఎమ్మెల్యే కాబోతున్నారు అని ఆమె అన్నారు.