శుభప్రద్ పటేల్ తో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ - మంత్రి కేటీఆర్ ఆదేశంతో ఒక్కటైన యువ నేతలు

శుభప్రద్ పటేల్ తో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ - మంత్రి కేటీఆర్ ఆదేశంతో ఒక్కటైన యువ నేతలు

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు లో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ తో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్ చొరవతో  వీరిద్దరూ సమావేశమయ్యారు. వీరిద్దరి భేటీ చర్చనీయాంశంగా మారింది. తాండూరు లో తన గెలుపు కోసం కృషి చేయాలని శుభప్రద్ పటేల్ ని కోరారు. గతంలో నావల్ల పొరపాట్లు జరగాయని వాటిని దృష్టిలో పెట్టికోవద్దని కోరారు. తాండూర్ లో తాన గెలుపుకు పెద్దన్నలాగా  సహాయ సహకారాలు అందించాలని కోరారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశానుసారంగా తాండూరు లో రోహిత్ రెడ్డి  గెలుపుకు తన వర్గం తో కలిసి బేషరతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని. శుభప్రద్ పటేల్ ధీమా ఇచ్చారు. గ్రామా గ్రామాన తన వెంట ఉన్న నాయకుల తిరిగి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామన్నారు.