జగిత్యాలలో శానిటరీ అధికారుల తనిఖీలు...
![జగిత్యాలలో శానిటరీ అధికారుల తనిఖీలు...](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_648ea6982eae1.jpg)
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:జగిత్యాల జిల్లా కేంద్రంలో కమీషనర్ ఆదేశాలమేరకు ఆదివారం చికెన్, మటన్ సెంటర్లలో శానిటరీ ఇన్స్పెక్టర్ ల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా నిషేధిత ప్లాస్టిక్ సీజ్ చేసి వారికి రూ. 5 వేల జరిమానా విధించారు.ఈ సందర్భముగా కమిషనర్ నరేష్ మాట్లాడుతూ సింగల్ యుజ్ ప్లాస్టిక్ నిషేధించడం జరిగినదని, వ్యాపారులు స్వచ్ఛందముగా ప్లాస్టిక్ నిషేధం పాటించాలని, లేనిచో జరిమానా విధించి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు కూడా ప్లాస్టిక్ నిషేదం పాటించాలని, నిషేధించిన ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని సూచించారు.ఈ తనిఖీలలో శానిటరీ ఇన్స్పెక్టర్లు బాల ఎల్లం అశోక్, జవాన్లు గోపాల్, బాబు, విష్ణు పాల్గొన్నారు.