అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
ముద్ర ప్రతినిధి, జనగామ : అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ శివారులో జరిగింది. ఎస్సై రఘుపతి తెలిపిన విరవరాల ప్రకారం.. రఘునాథపల్లికి చెందిన కడారి నర్సింగరావు (35)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాదాపు 10 ఏళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నా నర్సింగరావు కుటుంబ అవసరాల కోసం కొందరి వద్ద అప్పులు చేశాడు.
వాటిని ఎలా తీర్చాలని మనస్థాపానికి గురైన ఆయన శనివారం నిడిగొండ శివారులో ఉన్న ఓ చెట్టుకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించిన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని వారు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జనగామ ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.