పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం

పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :  చొప్పదండి మండలం గుమ్లాపూర్  గ్రామానికి చెందిన గుజ్జుల జగన్ రెడ్డి చొప్పదండి పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్ గ్రామానికి చెందిన తొంటి పోచాలుతో భూ తగాదా కొనసాగుతుంది. ఇరువార్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో గుజ్జుల జగన్ రెడ్డి అతని కుమారుడు మహేందర్ రెడ్డి లు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు.

ఈ క్రమంలో పోలీసులు ఇరువర్గాలతో మాట్లాడారు. ఇంతకుముందు ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం నడుచుకోవాలని లేదంటే కోర్టులో తేల్చుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట తన కొడుకు ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వద్దని వారించాల్సిన కొడుకు లేటుగా స్పందించాడు. పక్కనే ఉన్న పోలీస్ సిబ్బంది గమనించి చికిత్స నిమిత్తం హుటాహుటిన జగన్ రెడ్డిని కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. 24 గంటలు గడిస్తే కానీ రోగి కండిషన్ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. జగన్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది సీసీ కెమెరాలు రికార్డు అయింది.  దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.